భక్తి పాటలతో మారు మోగుతున్న దేవాలయాలు

560చూసినవారు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేకువ జాము నుండే శివాలయాలు పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని పురాతన శివాలయంలో చెన్న కేశవ భజన మండలి ఆధ్వర్యంలో రాత్రి జాగరణ భజన నిర్వహించారు. భూపతి నాగభూషణం, బొంగోని శ్రీనివాస్ ల బృందం భక్తి గీతాలను ఆలపించగా భక్తులు పరవశితులై తన్మయత్వం చెంది మంత్రముగ్దులైనారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్