ప్రజలంతా స్నేహభావంతో ఉండాలి

54చూసినవారు
ప్రజలంతా స్నేహభావంతో ఉండాలి
ప్రజలంతా స్నేహభావంతో ఉండాలని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ శంకర్ అన్నారు. శుక్రవారం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవ గ్రామసభ నిర్వహించారు. తహసిల్దార్ హాజరై మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి పౌరుడు సమానత్వంతో కులమత వర్గ భేదాలు లేకుండా కలిసి మెలసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన చారి, ఎంపీఓ గోవర్ధన్, ఆర్ఐ రాజేందర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్