సుల్తానాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఐతరాజ్ పల్లి, గర్రెపల్లి, పూసాల, నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ లలోని పాఠశాలలను సందర్శించి ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి సురేందర్ కుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.