పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ

51చూసినవారు
పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ
ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 2024 -25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్య పుస్తకాలను క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ బుధవారం అందజేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వారీగా ఒకటి నుండి పదవ తరగతి వరకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫాం, నోటుబుక్స్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సిఆర్పిలు ఓంకార్, తిరుపతి, రాజేందర్, రజిత, ఐఈఆర్పిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్