ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్ర

1089చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్ర
పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విఙ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. రామప్ప దేవాలయం, రామప్ప బ్రిడ్జి, కాకతీయ జూ పార్కు, వరంగల్ పోర్టును పాఠశాలకు చెందిన విద్యార్థులు సందర్శించారు. ప్రాచీన కళాఖండాలు, కాకతీయుల చరిత్రను తెలుసుకున్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాధ్యాయులు రామేశ్వర్, అశోక్, కనకయ్య, శ్రీనివాస్, మంజుల, శ్రీదేవి, సిఆర్పీ తిరుపతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్