పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు 'చేతిరాత'లో పోటీలు నిర్వహించారు. జాతీయ చేతిరాత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పిల్లలకు ఈ పోటీలు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి తెలిపారు. పిల్లల్లో రాత నైపుణ్యాలు పెంపొందిస్తున్నట్లు వారు తెలియజేశారు.