రామగుండం నియోజకవర్గ పరిధిలోని పెద్దంపేట, రాయదండి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బిజేపి రామగుండం నియొజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల బ్రతుకు బిజెపి ద్వారానే వికసిస్తున్నదని తెలిపారు. బానాల స్వామి, తోట కుమార స్వామి, బరుపటి నారాయణ, పైడిపల్లి విజయ్ గౌడ్, పైడిపల్లి ఓదెలు తదితరులు పాల్గోన్నారు.