విప్లవోద్యమ చరిత్రలో యు రాములు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు. గురువారం గోదావరిఖనిలో 20వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి తోకల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు పాల్గోన్నారు.