అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి రెడ్డి జేఏసీ ప్రతినిధులు

62చూసినవారు
అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి రెడ్డి జేఏసీ ప్రతినిధులు
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త అని మరియు విద్యారంగానికి మార్గదర్శకులని తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ప్రతినిధులు ఎ.రాంరెడ్డి, పి.రాంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, చుక్కారెడ్డి తదితరులు వారిని కలిసి మద్దతుగా తెలిపిన సందర్భముగా మాట్లాడారు. నేడు తెలంగాణలోని విద్యారంగం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందినదని మరియు విద్యార్థులకు తక్కువ ఫీజులో నాణ్యతమైన విద్యనందిస్తూ అగ్రగామిగా కొనసాగుతుండడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఒక గొప్ప విద్యావేత్త, సౌమ్యశీలైన వారిని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థి డా.వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యావేత్తగా పూర్తిగా అవగాహన కలవాడినని మరియు పట్టభద్రుల సమస్యలు తెలిసినవాడిగా తనని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. పట్టభధ్రులకు అన్ని విషయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ నియమకాల్లో ప్రాధాన్యం కలిపించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్