జిల్లా పరిషత్ పాఠశాలలో పోషణ పక్షోత్సవాలు
సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. పోషకాహారం సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పోశాకాహారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.