
సెలబ్రిటీలపై కేసు.. పంజాగుట్ట పోలీసుల కీలక ఆదేశాలు
TG: బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వారిపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. సోమవారం కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.