సిరిసిల్ల: పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్

72చూసినవారు
సిరిసిల్ల: పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్
పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎరువ రఘునాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్. ఎన్. ఆర్. కన్వెన్షన్‌లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రఘునాథ్ ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు. పీఆర్టీయూ ఎన్నికల్లో మోడల్ స్కూల్స్ తరుఫున ప్రథమసారి ప్రాతినిథ్యం దక్కడం ఆనందంగా ఉందని రఘునాథ్ అన్నారు.

సంబంధిత పోస్ట్