ప్రతీ ఒక్క ఓటరును కలవాలి: మూగ జయశ్రీ
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం మానకొండూర్ నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన జయశ్రీ మాట్లాడుతూ భారతదేశ సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అమలుచేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు వివరించాలని కోరారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనులను కూడా వివరించాలని పేర్కొన్నారు.