ఉచిత పశు వైద్య శిబిరం.. హర్షం వ్యక్తం చేస్తున్న పాడి రైతులు

71చూసినవారు
ఉచిత పశు వైద్య శిబిరం.. హర్షం వ్యక్తం చేస్తున్న పాడి రైతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఫోర్త్ ఇయర్ విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా 6 వ రోజున ఉచిత పశు వైద్య శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో భాగంగా పశు వైద్యులు డా. సతీష్ గ్రామంలోని రైతుల ఆవులకు, గేదెలకు మరియు గొర్రెలకు గర్భకోశ వ్యాధులను పరీక్షించి తగిన టీకాలు, మందులను అందజేశారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్