ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ అమ్మా ప్రసాద్ ఉండవల్లి నివాసంలో లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఉండవల్లిలోని తన నివాసంలో వీఏఆర్కే ప్రసాద్కు యువనేత నారా లోకేష్ పసుపు కండువా కప్పి ఆహ్వానించారు.