మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తనను గెలిపించేందుకు తన భార్యాబిడ్డలు ప్రచారం చేశారని, అందులో తప్పేముందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ను నిలదీశారు. నా గెలుపునకు నా భార్యాబిడ్డలు కారణమైతే.. నీ ఓటమికి నీ భార్య కారణమా? అని ప్రశ్నించారు.