నీటి సమస్యను తీర్చాలని కేజ్రీవాల్‌ కేంద్రానికి విజ్ఞప్తి (వీడియో)

82చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఆ రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే.. తాగేందుకు నీరులేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని పరిష్కరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, నీటి కొరతను పరిష్కరించడంలో సహాయం చేయాలని కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని నీటి కొరతకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్