AP: రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సచివాలయ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అదనంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.