ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న స్కార్పియో బైక్ రైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు ఒకర్ని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఢీ కొట్టిన తర్వాత కారు డ్రైవర్ పారిపోయిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.