కేజ్రీవాల్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చు: ఆతిశీ

74చూసినవారు
కేజ్రీవాల్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చు: ఆతిశీ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ మంత్రి ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చని పేర్కొన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ అధికారులు ఖండించిన నేపథ్యంలో తాజాగా ఆతిశీ ఈ మేరకు స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తీహార్ జైలు అధికారులు, బీజేపీ పత్రాలను విడుదల చేస్తోందని తెలిపారు. సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్