లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. ఈడీని కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనడానికి తనను అరెస్టు చేసిన సందర్భమే పెద్ద ఉదాహరణ అని ఆరోపించారు. లిక్కర్ కేసులో తన పార్టీకి సౌత్ గ్రూపు నుంచి ఎలాంటి ముడుపులు అందలేదని, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని తెలిపారు.