కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శాశ్వతంగా కలిసి ఉండేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్తో పెళ్లేమీ జరగలేదు. ప్రస్తుతానికి బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ఢిల్లీలో 7 లోక్ సభ స్థానాల్లోనే పొత్తు పెట్టుకున్నాం. పంజాబ్లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాం’’ అని తెలిపారు.