AP CEO ముకేశ్కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.