తెలంగాణ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుబట్టింది. PCSS ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లయితే.. రీ-ఇంజనీరింగ్ చేశాక కాళేశ్వరం, ప్రాణహిత రెండింటికీ కలిపి 85,651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్ తో ఉమ్మడి ప్రాజెక్టు ఖర్చు 122% మేర పెరిగిందని తెలిపింది. ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది.