కాళేశ్వరంపై కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

124953చూసినవారు
కాళేశ్వరంపై కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
తెలంగాణ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ విధానాలను కాగ్‌ తప్పుబట్టింది. PCSS ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లయితే.. రీ-ఇంజనీరింగ్ చేశాక కాళేశ్వరం, ప్రాణహిత రెండింటికీ కలిపి 85,651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్‌ తో ఉమ్మడి ప్రాజెక్టు ఖర్చు 122% మేర పెరిగిందని తెలిపింది. ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్