ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ నగరంలో ఇంటింటికి తిరుగుతూ, ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉన్నది, ఏ పాఠశాలలో చదువుతున్నది మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని తెలిపారు.