ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూరు గ్రామ రింగురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను సోమవారం జిల్లా పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు అనుమానాస్పదంగా ఉండే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత స్థానిక చెక్ పోస్ట్ అధికారులకు సూచించారు.