వరద బాధితులకు సాయం అందలేదు: వీరభద్రం

68చూసినవారు
వరద బాధితులకు సాయం అందలేదు: వీరభద్రం
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామపంచాయతీ కేబీఆర్ నగర్-2 వరద బాధితులకు సాయం అందలేదని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అధికారులు సర్వే చేసి పేర్లు నమోదు చేసుకున్నప్పటికి ప్రభుత్వ నష్టపరిహారం రూ. 16, 500 బాధితులకు అందలేదని చెప్పారు. లిస్టులో తమపేర్లు లేదని బాధితులు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్