జిల్లా రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు: నున్నా

69చూసినవారు
జిల్లా రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు: నున్నా
పాలేరు చెరువు ఆయకట్టు పరిధిలో నీళ్లు లేక నెర్రెలు బారిన వరి పొలాలను బుధవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ పరిశీలించారు. ఇటీవల భారీ వరదల కారణంగా నాగర్జున సాగర్ పాలేరు ఆయకట్టు కాలువకు గండి పడింది. సుమారు నెల రోజులు కావస్తున్న ప్రభుత్వ యంత్రాంగం రైతాంగానికి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు. జిల్లా రైతులకు భరోసా ఇవ్వడం లేదని విమర్శించారు. సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్