పైనంపల్లి టోల్ ప్లాజా ప్రారంభానికి సిద్ధం

82చూసినవారు
పైనంపల్లి టోల్ ప్లాజా ప్రారంభానికి సిద్ధం
నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి వద్ద టోల్ ప్లాజా ప్రారంభానికి సిద్ధమైంది. కోదాడ -కురవి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పైనంపల్లి వద్ద టోల్ ప్లాజా నిర్మించారు. ఇక్కడ గేట్లు, కేబిన్లు సహా అంతా సిద్ధం చేయగా, రెండు వైపులా బోర్లు సైతం ఏర్పాటు చేసి ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న నేపథ్యాన త్వరలోనే టోల్ ప్లాజా వద్ద వసూళ్లు మొదలుకానున్నాయని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్