వీహెచ్ దాతృత్వం.. ఆ కుటుంబానికి రూ. 50వేలు సాయం

50చూసినవారు
ఖమ్మం వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ ఇటీవల కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరద తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందిన యాకూబ్, సైదాబీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీ. హనుమంతరావు పరామర్శించారు. ఈ సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు మరణించడంతో అనాథలైన వారి కుమారులకు రూ. 50వేలు నగదు సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరుపున సహాయం త్వరగా అందేలా కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్