మణుగూరులోని సుందరయ్య నగర్ కు చెందిన గాదె నాగేశ్వరరావు(47) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ నెల 8న గడ్డిమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.