ఈనెల 13, 14 తేదీలలో మధిరలో జరిగే ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ యువతకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సత్తుపల్లి నియోజకవర్గం రుద్రాక్షపల్లిలో ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా యువ సంపద కలిగిన దేశం భారతదేశం అని అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.