వేంసూరులో దొంగల హల్ చల్.. హార్డ్ డిస్క్ లు మాయం

27880చూసినవారు
వేంసూరు మండల కేంద్రంలో శుక్రవారం దొంగలు హల్ చల్ చేశారు. వ్యవసాయ సహకార పరపతి సంఘం, బుల్లెట్ షోరూం, ఓ హోటల్లో దుండగులు ఒకేసారి చోరీలకు పాల్పడ్డారు. సహకార సంఘం వెనుక నుంచి కిటికీలు తొలగించి లోనికి వెళ్లారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న షోరూం, హోటల్లోకి చొరబడ్డారు. కౌంటర్లో ఉన్న రూ. 15వేల నగదు, సీసీ కెమెరా హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్