గాలి దుమారంతో ధ్వంసమైన కిరాణా షాపు

549చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని రాబోజి తండ గ్రామంలో ఒంటరి మహిళ లక్ష్మి కిరాణం షాపు ఆదివారం రాత్రి వేసిన భారీ గాలి దుమారం, వర్షంతో పూర్తిగా ఇల్లు ధ్వంసం అయింది. ఒంటరి మహిళ అయిన లక్ష్మి తనకున్న కొద్దిపాటి ఆర్థిక స్తోమతతో కిరణం షాపు నడుపుకుంటూ జీవిస్తుంది. అకాల వర్షంతో ఆ షాపు పూర్తిగా ద్వంశం కావడంతో పాటు కిరాణా సరుకులు మొత్తం పూర్తిగా తడిసిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని ఆమె సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్