చలివేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే

573చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే
కారేపల్లి మండలం కారేపల్లి క్రాస్ రోడ్డులో గుడ్ మార్నింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ యువకులు ముందుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్