ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్పై కియా మోటార్స్ ఫోకస్ చేసింది. తమ ప్లాన్స్లో భాగంగా.. అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లింగ్గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీని.. 2024లో ఇండియాలో లాంచ్ చేస్తామని గతేడాది చెప్పింది. ఇప్పుడు ఈ కియా ఈవీ9కి సంబంధించిన కీలక అప్డేట్ బయటకి వచ్చింది. దీనిని త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.