కిసాన్ మాన్‌ధన్ యోజన.. ప్రతి నెలా రూ.3,000

68చూసినవారు
కిసాన్ మాన్‌ధన్ యోజన.. ప్రతి నెలా రూ.3,000
'కిసాన్ మాన్‌ధన్ యోజన' పథకాన్ని వృద్ధాప్యంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో చేరే వారి వయసు 18-40 ఏళ్లలోపు ఉండాలి. ప్రతి నెలా రూ.55 నుంచి రూ.220 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండగానే రైతుల బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేల చొప్పున కేంద్రం జమ చేస్తుంది. రైతు చనిపోతే ఆయన భార్యకు పెన్షన్ మొత్తంలో సగం అందుతుంది. తగిన పత్రాలతో మీ సేవా కేంద్రాల ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్