కోల్కతాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననాంగాలపై 14 గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టంలో గుర్తించారు. ఆమె ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్నారు.