ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని శనివారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావు దంపతులు దర్శించుకున్నారు. వెంకన్న జాతరను కలెక్టర్ దంపతులు తిలకించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించి వేద పడింతుల ఆశీర్వాచనాలు తీసుకున్నారు.