తిర్యాణి మండల కేంద్రంలోని కన్యక పరమేశ్వరి ఆలయం దగ్గర కాలువ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడి పాదకాలు నేలకు తాకి వుండటం, ఉరేసుకున్న చెట్టు నేలకు అతి చిన్నదిగా ఉండటం లాంటి సంఘటనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్థులు, స్థానికులు అనుమానిస్తున్నారు. తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.