రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జాములేధర గ్రామానికి చెందిన పుర్క విశ్వనాథ్ సోమవారం సాయంత్రం లింగాపూర్ కు బయలుదేరాడు. బైక్ అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ ను ఢీకొని గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.