కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి బ్రిడ్జి వద్ద నిర్మాణంలో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పనులను ఆదివారం సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. బ్రిడ్జ్ పైకి ఎక్కి కాంట్రాక్టర్ ను పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి చేసి బ్రిడ్జ్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.