కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ రోడ్డు శివారు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందారు. కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని అన్నారు. దీంతో మృతదేహాన్ని సిర్పూర్(టి) మార్చురీకి తరలించడం జరిగింది. ఎవరైనా గుర్తుపడితే రూరల్ పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు.