కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తోట శోభ ఇంట్లో ఎరవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి నాలుగు తులాల బంగారం, 50వేల రూపాయలు నగదును దోచుకెళ్ళారు. పోలీస్ డిపార్ట్మెంటుకు చెందిన ఖాజా హబీబుద్దీన్ ఇంట్లో, కాపు వాడకు చెందిన బాబా ఖాన్ కిరాణం షాపులో దొంగతనానికి యత్నించారు. డాగ్స్ స్క్వార్డుతో కాగజ్నగర్ డీఎస్పి కరుణాకర్, సిఐలు, ఎస్ఐలు తనిఖీలు చేపట్టారు.