పంచాయతి కార్యాలయం పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం

71చూసినవారు
పంచాయతి కార్యాలయం పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతి కార్యాలయం పక్కన వీదిలో రోడ్డు లేక రహదారి అంతా వర్షానికి నీళ్లు నిలిచి గుంతలమయంగా అయింది. వాహనదారులకు, బాటసారులకు, వృద్దులకు, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిలిచిన నీటిని దోమలు వాటి నివాసంగా మార్చుకుంటున్నాయి. ఈ వర్షాకాలంలో ప్రజలు మలేరియా, డెంగ్యు బారిన పడే ప్రమాదముంది. కావున దయచేసి రోడ్డు వేయగలరని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్