జూలూరుపాడు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా

586చూసినవారు
జూలూరుపాడు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా
జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగులు మీరాను నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ అందజేశారు. ఈ సందర్భంగా నాగులుమీరా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్