స్థల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి

57చూసినవారు
స్థల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ వెన్నెల నగర్లో ఇటీవల ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించిందని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తాగునీరు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసి రూ. 5 లక్షల అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్