ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి గురు పూజా మహోత్సవములు

72చూసినవారు
పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో పవిత్ర ఆరాధనా గురు పూజా మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి పెద్దోజు నాగాచార్యులు ఆధ్వర్యంలో శుక్రవారం స్వామివారి సుప్రభాత సేవ, ఉత్సవమూర్తులకు అభిషేకాలు, గణపతి పూజ, మండపారాధన, కలశపూజ, తదితరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్