నిబద్ధతతో కమ్యూనిస్టు పార్టీలో పని చేయాలి

66చూసినవారు
నిబద్ధతతో కమ్యూనిస్టు పార్టీలో పని చేయాలి
నిబద్ధతతో కమ్యూనిస్టు పార్టీలో పని చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా కోరారు. ఇటీవల పాత పాల్వంచ ప్రాంతానికి చెందిన పలువురు సిపిఐ పార్టీలో చేరారు. వారికి శుక్రవారం సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. సిపిఐ లో చేరిన ప్రతి ఒక్కరు ప్రజాసంఘాల బాధ్యతలు స్వీకరించి నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్