సీఐటీయు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల ర్యాలీ

83చూసినవారు
బయ్యారం మండల కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పెంచాలని మండల నాయకులు వెంకన్న డిమాండ్ చేశారు. అటు పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం మండల అధికారులకు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్